సిరా న్యూస్,సిరిసిల్ల;
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి లో వ్యవ సాయ పొలం వద్ద పిడుగు పడింది. వర్షం కారణంగా చెట్టు దగ్గర కంబాల శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్ లు నిలుచున్నారు. కంబాల శ్రీనివాస్ (32) సమీపంలో పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నలుగురికీ గాయాలు అయ్యాయి. వారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
=====================