సిరా న్యూస్,మంథని;
తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవ సంస్థ శ్రీ కళవేదిక తెలుగుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాతీయ శతాధిక సాహిత్య కవి సమ్మేళనం లో మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన పోయిల లక్ష్మణ్ పాల్గొని పల్లెటూరి జానపద గీతం ఆలపించారు. అతని జానపదాన్ని మెచ్చిన సంస్థ నిర్వాహకులు కవి లక్ష్మణ్ ను సన్మానం నిర్వహించి ప్రశంస పత్రంతో పాటు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి డా. ధానాసి ఉషరాణి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పి. కుసుమ కుమారి, పంచ గుణిత సహస్రావధాని తి.తి.దే. సభ్యులు డా. మేడసాని మోహన్, తెలుగు రాష్ట్రాల కవులతో పాటు తమిళ, కన్నడ కవులు పాల్గొన్నారు.