కోడి నాదే అంటున్న మహేష్
రుద్రంగీ కి చెందిన మహేష్….
నెల్లూరు వాసి అయిన మహేష్ రుద్రంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం.
ససేమిరా అంటున్న ఆర్టీసీ అధికారులు
సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లాలో ఓ కోడి వ్యవహారం కొద్ది రోజులుగా ఆర్టీసీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది… ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడంటూ అధికారులే దాని బాధ్యత తీసుకొని దానా వేస్తూ ఆలనా పాలనా చూశారు.
అయితే దీని వ్యవహారం ఇబ్బందికరంగా మారడంతో వేలం వేయాలని నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ ఆర్టీసీ రెండవ డిపోలో వేలానికి సమయం కేటాయించారు. దీంతో పలువురు వేలంలో పాల్గొని తమ వంతు పాట పాడాలనుకున్నారు. అయితే అది సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ కా… లేక సరదాగా పెంచుకోవడానికా అని సోషల్ మీడియాలో నెటిజన్ల సరదా కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి ఆ కోడి తనదేనంటూ బిగ్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం