సబ్బితం గ్రామవాసికి ఫార్మసీ లో డాక్టరేట్

సిరా న్యూస్,పెద్దపల్లి;
మండలం లోని సబ్బితం గ్రామానికి చెందిన పులిపాక శంకరయ్యకు ఫార్మసీ లో డాక్టరేట్ లభించింది. పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆశిష్ సుత్తీ, డాక్టర్ ఎం.రవికుమార్ పర్యవేక్షణలో అయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథం “డెవలప్‌మెంట్, ఆప్టిమైజేషన్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ నానో ఫార్ములేషన్స్ ఆఫ్ ఆల్పీనియా మ్యూటికా అండ్ ట్రేడ్‌స్కాంటియా స్పాథేసియా యాంటీ-డయాబెటిక్ యాక్టివిటీ” లో డాక్టరేట్ లభించింది. పులిపాక నర్సయ్య పులిపాక మధునమ్మ దంపతుల కుమారుడైన శంకరయ్య ఏడవ తరగతి వరకు కమాన్ పూర్ మండలం పేర పల్లి గ్రామములో చదువు కున్నాడు. పదవ తరగతి వరకు పెద్దపల్లిలోని ఇండియన్ మిషన్ సెకండరీ స్కూల్ లో, ఇంటర్ పెద్దపల్లి ప్రభుత్వ కాలేజీలో, బి.ఫార్మసీ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీలో ,ఎం.ఫార్మసీ వరంగల్ లోని వాగ్దేవి ఫార్మసీ కాలేజీలో చదువగా ప్రస్తుతం హైదరాబాద్ లోని కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు డాక్టరేట్ లభించడం పట్ల గ్రామంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *