సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు యూనివర్సిటీకి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. తరువాత అయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ కు వి ఎస్ యు వైస్ ఛాన్స్లర్ జిఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తదితరులు ఘన స్వాగతం పలికారు