సిరా న్యూస్,పెడన;
బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో దారుణం జరిగింది. భర్త మెడపై భార్య స్క్రూ డ్రైవర్ తోపొడిచి హత్య చేసింది. తరచూ తాగి వచ్చి కొట్టడంతో హింస భరించలేక హత్య చేశానపి భార్యఅంటోంది. అప్పారావు (30), కీర్తన లకు తోమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడు సంవత్సరాల బాబు వున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటలు గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆవేశంతో స్క్రూ డ్రైవర్ తో కీర్తన భర్త మెడపై పొడిచి చంపింది.
====