ప్రియుడి మోజులో పడి మందలించిన భర్తను ప్రియుడు తో కలిసి భర్తను చంపిన భార్య

సిరా న్యూస్,కడప;
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గాజుల గంగయ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. అతని భార్య సంధ్య తన ప్రియుడితో ఇంట్లో ఉండటం చూసి గంగయ్య మందలించాడు. దాంతో కోపం పెంచుకున్న సంధ్య ప్రియుడు బాలరాజుతో కలిసి భర్తను హతమార్చింది. గంగయ్య కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సంధ్య, బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *