సిరా న్యూస్,హైదరాబాద్;
మణికొండ శివాజీనగర్ కాలనీలో ఓ మహిళ
న్యాయ పోరాటానికి దిగారు. అత్త వేధింపులు భరించలేక పోతున్నానని వాపోతూ సుధారాణి అనే మహిళ మంగళవారం ప్రజాపాలన ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. తన భర్త మృతిచెందాడని, ఆస్తులు మాత్రం ఆడపడుచులకు అత్త రాసిందన్నారు. తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ఆస్తులు తన పిల్లలకు రాసివ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజాపాలన కౌంటర్ ఎదుట బైఠాయించారు.