మాజీ ఎంపిటీసీ ఇంటిముందు మహిళ అందోళన

సిరా న్యూస్,మండపేట;
మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలొమాజీ ఎంపిటిసి అన్నందేవుల చంద్రరావు ఇంటిముందు మహిళ ( అంకం మంగాదేవి ) నిరసనకు దిగింది.తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని నాభర్తకు నాకు విడాకులు ఇప్పిచి నన్ను లోబరుచుకుని నాకు నా కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించి తన బిడ్డల చదువులకు పెళ్లిళ్ల కోసం దాచుకున్న 20 లక్షలరూపాయలు డబ్బు కాజేసారని ఆరోపించింది. 15 సంవత్సరాలుగా తనతో సహజీవనం చేస్తూ ఇప్పుడు తాను ఎవరి తెలియదని మోసగించరని మంగాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ వెంట మద్దతుగా బిసీ సంఘనాయకులు, మహిళలు పాల్గోన్నారు. పోలీసులను, స్థానిక నాయకులను ఆశ్రయించినా న్యాయం తు జరడలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *