ప్రాణాలు కాపాడిన త్రీ టౌన్ పోలీసులు
సిరా న్యూస్,కాకినాడ;
సెల్ఫోన్ దొంగతనం చేసావ్ అంటూ చేసిన నిందలకు తట్టుకోలేక ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రిస్క్ చేసి, ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడితో చాకచక్యంగా వ్యవహరించి ఆత్మహత్యను నిలువరించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొని ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన త్రీ టౌన్ పోలీసులను అభినందించారు. వివరాల్లోకెళ్తే కాకినాడ జిల్లా చిత్రాడ కు చెందిన ప్రదీప్ కుమార్ ను సెల్ఫోన్ దొంగతనం చేసావ్ అంటూ స్థానికులుఅవమానం చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో bsnl ఆఫీస్ టవర్ పై ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృష్ణ భగవాన్ ఆదేశాల మేరకు ఎస్సై ఎం సాగర్ బాబు ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గరకు చేరుకుని సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ యువకుడు చేసే ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించగలిగారు. ఎస్సై సాగర్ బాబు యువకుడికి ధైర్యం చెప్పి, తనపై పడ్డ నిందను లేకుండా చేస్తామని హామీ ఇచ్చి సురక్షితంగా శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో కిందకు దింపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడు ప్రాణాలను కాపాడిన ఎస్ఐ సాగర్ బాబు, వారి సిబ్బంది PC శ్రీనివాసరావు ను స్థానికులు అభినందించారు.చిత్రాడ కు చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఈ ఆత్మహత్య ప్రయత్నం చాలా గందరగోళ పరిస్థితి,టెన్షన్ ఏర్పడింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆత్మహత్య ప్రయత్నాన్ని నిలువరించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.