సిరా న్యూస్,మేడ్చల్;
ఉద్యోగం రావట్లేదని మనస్థాపం చెందిన వడ్లకొండ రంజిత్(24) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్ల లోని కనకదుర్గ కాలనీలో మే12న జరిగింది.రంజిత్ తల్లి భాగ్యమ్మ(48) మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం రావట్లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పిర్యాదు చేశారు. ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధి కరీంగూడ చౌరస్తాలో 25 లక్షల హవాలా డబ్బు కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. 25 లక్షల డబ్బును తరలిస్తున్న డబ్బుని సస్పెండ్ అయిన ఇద్దరు కానిస్టేబుల్ లకు వడ్లకొండ రంజిత్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. మరుసటి రోజే రంజిత్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ….
====================