సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని శివారెడ్డిగూడ చౌరస్తా వద్ద బైక్ ని కారు ఢీ కొనడంతో రాంపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్(32), శ్రీకాంత్(26) అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంట్లో ప్రశాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘట్కేసర్ నుండి రాంపల్లి కి బైక్ పై ప్రయాణిస్తుండగా బుధవారం రాత్రి సంఘటన జరిగింది. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్(32), శ్రీకాంత్(26) అనే ఇద్దరు యువకులలో ప్రశాంత్ కడుపు భాగంలో పెద్ద గాయం జరిగి ప్రేగులు బయటకు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.