పరామర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుజాత సాల్మన్
సిరా న్యూస్,అరకులోయ;
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం సికొలని లో నివాసముంటున్న పడవల నరేంద్ర గురువారం కేజీహెచ్ లో మరణించారు. కుటుంబానికి ఆధారమైన కొడుకు చనిపోవడం తో అనాథలైన కోడలు మనవడ్ని చూసి దుఃఖం తో విలపిస్తున్నారు. మరణవార్త తెలుసుకున్న సామాజిక కార్యకర్త ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుజాత సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వివరాల్లోకి వెళితే నాగేంద్ర అరకులోయ లో సెల్ మేకానిక్ గా పనిచేస్తూ తన భార్య రాజేశ్వరి,కుమారుడు వృద్యాపం ఉన్న తల్లి తండ్రులను పోషించే వాడు కామెర్లు తో గత కొన్ని నెలలుగా బాధ పడుతున్నాడు ఆరోగ్యం విషమించడంతో బుదవారం సాయంత్రం మూడు గంటలకు ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు సరైన వైద్యం కోసం డాక్టర్స్ సాయంత్రం ఆరు గంటలకు కేజీహచ్ తరలించారు. అయితే గురువారం 7:20 ఉదయం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న యువకుడు మరణించడం తో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వము ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.