అగ్గిపెట్ట గొడవకు యువకుడు బలి

సిరా న్యూస్,వరంగల్;
అగ్గిపెట్ట గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది.ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలో మద్య మత్తులో అగ్గిపెట్ట కోసం యువకుల మధ్య గొడవ జరిగింది. గత సోమవారం కొలన్ పెల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో రెండు వర్గాల చెందిన యువకులు అగ్గిపెట్ట కోసం వాగ్వాదానికి దిగారు. ఓ వర్గం చెందిన యువకుడు బీరు సీసాతో తలపై బాధడంతో భేతి రామ్ చరణ్ (17) స్పృహ తప్పి పడిపోయాడు.
అపస్పారక స్థితిలో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి రామ్ చరణ్ మృతి చెందాడు. మృతుడు పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన వాడు. సంక్రాంతి పండుగ సెలువులలో అమ్మమ్మ ఇంటికి రాయపర్తి మండలం కోలన్ పల్లికి వచ్చాడు. వరంగల్ లోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు,. రామ్ చరణ్ మృతితో కుటుంబ సభ్యులు, శోకసముద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *