భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు
యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె
సిరా న్యూస్,మదనపల్లె;
అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురి అయ్యాడు. శనివారం వేకువుజమున మదనపల్లిలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు(25)ను కత్తులు, వేటకుడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. సమాచారం అందుకున్న డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి, సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. మృతుడు వైకాపా కార్యకర్త అని సమాచారం