ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సహయం

ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం : ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్

సిరా న్యూస్,న్యూఢిల్లీ

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీలు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ప‌న్నున్ తెలిపారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. దేవింద‌ర్ పాల్ సింగ్ బుల్లార్ రిలీజ్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ఆ వీడియోలో ప‌న్నున్ ఆరోపించారు. 1993 ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు. మ‌రో వైపు మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. క‌స్ట‌డీలోనే ఉంటూనే సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగిన స‌మ‌యంలో కేజ్రీవాల్ వాడిన ఫోన్ ప్ర‌స్తుతం మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *