సిరాన్యూస్, ఖానాపూర్
కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి
* ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్
* జోరుగా ఎంపీ అభ్యర్థి సుగుణ ప్రచార కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు గ్యారంటీ కార్డు గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతుందని, అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మళ్లీ ఎంపీ ఎలక్షన్లో ఇంకా నూతనంగా 5 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, అడ్వాల శంకర్, ఉప్ప సర్పంచ్ దొనికేని సాగర్, మాజీ సర్పంచ్ యు. భీమన్న, నాయిని సతీష్, బి. రాజేందర్, డాక్టర్ బి. రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.