సిరాన్యూస్, బేల
డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ
* ఎమ్మెల్యే పాయల్ శంకర్కు వినతి
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి జరగబోయే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ మార్చడం జరిగింది..ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా..బేల మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థులు దాదాపుగా గిరిజన గ్రామాల నుండి ఇక్కడ చదువుకోవడానికి వస్తుంటుంటారు. మారుముల గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోవాలంటే రవాణా సౌకర్యాలు సరిగా ఉండవు అలాంటిది జిల్లా కేంద్రంలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి వెళ్లాలంటే కత్తి మీద సామె. బేల మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగిన డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని కాకతీయ యూనివర్సిటీ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కు మార్చడం జరిగింది. దీంతో గిరిజన గ్రామాల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుఅంధకారంగా మారె అవకాశం కనిపిస్తుంది. మండల కేంద్రం నుండి జిల్లా పరీక్ష కేంద్రానికి దూర భారం దాదాపుగా 50 కిలోమీటర్లు ఉంటుంది రాబోయేది వర్షాకాలం సీజన్ రవాణా సౌకర్యం సరిగా లేదు తర్ణం బ్రిడ్జి కారణంగా 500 కు పై బడి విద్యార్థులకు దూరభారం తో పాటు ఆర్ధిక భారం సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకుంటామో లేదో అని భయందోళనకు గురి అవుతున్నారు. ఒకసారి బేల మండలంలో, మరో సారి అదిలాబాద్ లో పరీక్ష కేంద్రాన్ని తర్చు మార్చుతూ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఈ నెల 13 వ తేదీ నుండి ప్రారంభంమయ్యే డిగ్రీ సెమిస్టర్లకు పరీక్ష కేంద్రాన్ని బేల మండల కేంద్రంలోనే కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలని ఏబీవీపీ నాయకులు కోరారు. కార్యక్రమంలో ఏబీవీపి జిల్లా ఎస్ ఎఫ్డీ కన్వీనర్ శివానీత్ వార్ ఓం ప్రకాష్, జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి, అక్షయ్, సాయి, గాజు తదితరులు పాల్గొన్నారు