సిరాన్యూస్,బేల
రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్: ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్
సర్కారీ బడుల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు స్కూల్లో ఫీజులు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చిందని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని, ప్రవేటు స్కూళ్లలో బుక్స్,యూని ఫామ్ అమ్మకాలపై కఠినచర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ స్కూళ్లలో డీఈవో,ఎంఈవోల ను నియమించాలని, మధ్యాహ్న భోజనం అవక తవకలపై విచారణ జరపాలని, మెగా డీఎస్సీ ద్వారా 24 వేల ఖాళీలు భర్తీ చేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. రేపు ఏబీవీపీ ఇచ్చిన పాఠశాలల బంద్ కు అన్ని పాఠశాలల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు రేసు మనోజ్ రెడ్డి, రాపెళ్లివార్ కృష్ణ, అక్షయ్, సచిన్, సాయి, సాయి పాయల్, గాజు తదితరులు పాల్గొన్నారు