-మూడోతరానికి రాజకీయ వారసత్వం
-టికెట్ కేటాయింపులో ఆచి తూచి అడుగులు
-ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం
-గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో రాజకీయ వేడి రాజుకున్నదనే చెప్పాలి. ముందుగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పెద్దపెల్లి ఎంపీ స్థానానికి కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేయగా, బిజెపి నుండి గోమాసశ్రీనివాసును ఎంపిక చేసింది. ఇక మిగిలింది ప్రధాన పార్టీ కాంగ్రెస్. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది ఆశావాహా లు పోటీకి సిద్ధమై తమ తమ ప్రయత్నాల్లో మునిగి తేలారు. చాలా మంది పెద్దపెల్లి ఎంపీ స్థానంపైఆసక్తి కనపరచడంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వనరులు ఉండడం ఒక కారణమైతే ప్రజల మనసును గెలవడం ఎంతో సులువు అనే విషయాన్ని చాలా మంది నాయకులు గ్రహించారు. అందుకేఇక్కడ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు చాలామంది పోటీ పడుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులుపేర్కొంటున్నారు.
ఇందులో ప్రధాన అంశంగా చెప్పుకోవాల్సింది మాజీ కేంద్రమంత్రి, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పేరు ఇక్కడి ప్రజల నరనరానా జీర్ణించుక పోయింది. గత నాలుగు దశాబ్దాలుగా వారి కుటుంబంలోని
వారే ఇక్కడ ఎంపీలుగా గెలవడం ఆనవాయితిగా మారింది. ఇక మూడోతరమైన గడ్డం వంశీకృష్ణ కూడా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేయనుండడం గమనార్హం. గడ్డం వెంకటస్వామి తర్వాత గడ్డం వివేక్ఎంపీగా పలుమార్లు ఇక్కడ నుండి గెలుపొందారు. ఆ తర్వాత గెలిచిన ఏ పార్టీ నాయకులు కూడా ఒక ఒకమారు మాత్రమే తప్ప మళ్ళీ గెలవలేదు వారికి మళ్ళీ టికెట్ కూడా దక్కలేదు. ఇదే ప్రయత్నంలో బిఆర్ ఎస్ నుండి టికెట్ మళ్లీ రాదని గ్రహించి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత బిఆర్ ఎస్ పార్టీ ఎంపీ వెంకటేష్ నేతకు కాంగ్రెస్ పార్టీ నుండి చుక్కెదురైందనే చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి జోష్ మీద సాగుతున్నది.అందులో గడ్డం కుటుంబంలో చెన్నూరు నుండి వివేక్ బెల్లంపల్లి నుండి వినోద్ లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కూడా గడ్డం వంశీకృష్ణకు కలిసి వచ్చిందనే చెప్పాలి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోవారికి మంచి పట్టున్న స్థానాలు కావడం కూడా ఈసారి పెద్దపెల్లి ఎంపీ స్థానం గెలిచేందుకు మెండైన అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్డం ఫ్యామిలీ నుండి మూడోతరం నాయకుడు ఎంపీగా రాబోతున్నారని పలువురుచర్చించుకోవ డం విశేషం. ఏప్పటి నుండో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు అందిస్తూ వస్తున్న గడ్డం కుటుంబం ఇకపై పెద్దపల్లి జిల్లాతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాలను ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో పలు సమావేశాల్లో ఆయన పెద్దపెల్లి ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తారని పలు వర్గాల ప్రజలు ఆశిస్తున్నారు.