ACB: భోర‌జ్ చెక్ పోస్ట్‌లో ఏసీబీ అధికారుల దాడులు

సిరాన్యూస్‌, జైనథ్:
భోర‌జ్ చెక్ పోస్ట్‌లో ఏసీబీ అధికారుల దాడులు
* ప‌లు రికార్డులు స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ సమీపంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ పై ఏసీబీ ఇన్స్పెక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనపరుచుకున్నారు.మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు భోరజ్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారి పై గల చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఎంవీఐ యశ్వంత్, ఏఎంవీఐ అపర్ణ, విధులు నిర్వహిస్తుండగా అక్కడే కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. నిత్యం వేలాది వాహనాలు బోరజ్ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగిస్తుండగా భారీ వాహనాలకు సంబంధించి లైసెన్సు పర్మిట్, సరుకు రవాణా వేబిల్స్, వాహన బిల్లులు డాక్యుమెంట్ లపై ఎంత మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఈ సందర్భంగా ఏసీబీ సీఐ తిరుపతి మీడియాతో మాట్లాడుతూ పలు రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *