తస్లీమా మహమ్మద్ బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు

సిరా న్యూస్,మహబూబాబాద్;
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో.. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆమె ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు అనిశా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2.94 కోట్లు, మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *