సిరా న్యూస్,విజయవాడ;
ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు లో ప్రమాదం జరిగింది. బూడిద లారీ ఢీకొని ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుడు ఉప్పతల శ్రీనివాసరావు (48) దుర్మరణం చెందాడు. రాత్రి విధులు ముగించుకుని శనివారం ఉదయం ఇంటికివస్తుండగా ప్రమాదం జరిగింది. ఇంటికి కూతవేటు దూరంలోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు బూడిద లారీల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయనిఉధృతంగా పోరాటం చేస్తున్నాఅధికారులు స్పందించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.