సిరా న్యూస్,కోదాడ;
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బిఆర్ఎస్ నిరసన ధర్నాలలో భాగంగా కోదాడ పట్టణంలోని ఖమ్మం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..