ACP Tirumal: ప్ర‌జ‌ల‌తో సత్సంబంధాలు ఏర్ప‌రుచుకోవాలి:  ఏసీపీ తిరుమల్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
ప్ర‌జ‌ల‌తో సత్సంబంధాలు ఏర్ప‌రుచుకోవాలి:  ఏసీపీ తిరుమల్
* వంగర పోలీస్ స్టేషన్ ఆక‌స్మికంగా త‌నిఖీ

పోలీసులు ప్ర‌జ‌ల‌తో సత్సంబంధాలు ఏర్ప‌రుచుకోవాల‌ని కాజీపేట ఏసీపీ తిరుమల్ అన్నారు. శుక్ర‌వారం భీమదేవరపల్లి మండ‌లంలోని వంగర పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆక‌స్మీకంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ ఎస్సై రూము స్టాఫ్ రూమ్, రైటర్ రూము, రికార్డు రూమ్స్ ,బాత్రూమ్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సన్నిహిత జనరల్ డైరీ,కేడి,డీసి, రౌడీ షీట్స్, అన్ని రికార్డ్స్ పరిశీలించి సూచనలు అందించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేస్తున్నవా లేదా అని ప‌రిశీలించారు. సిబ్బందితో మాట్లాడి డ్యూటీ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు సరైన న్యాయం చేయాల‌ని సూచించారు. ప్రతి దరఖాస్తుదారుని సమస్యను స‌త్వ‌ర‌మే పరిష్కరించాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పకూడదని సూచించారు. అవసరమైన వాటికి చట్టపరంగా కేసులు నమోదు చేయాల‌ని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపి కాజీపేట, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్ పాల్లొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *