ఏబీవీపీ
సిరా న్యూస్,హైదరాబాద్;
ఇంటర్మీడియట్ బోర్డ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న కార్పొరేట్ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు.
సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలలు అకాడమిక్ ఇయర్ కంటే ముందే సిలబస్ లు పూర్తి చేయాలని విద్యార్థులను మానసికంగా హింసిస్తూ ఫీజుల దాహంతో తమ స్వలాభం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, వేసవి సెలవుల్లో ఎంసెట్ క్లాస్ ల పేరు మీద అక్రమంగా సెకండ్ ఇయర్ క్లాసులు నడుపుతున్నారని, నోటిఫికేషన్ రాకముందే 90 శాతానికి పైగా తీసుకుంటున్నటువంటి అడ్మిషన్స్ మొత్తం వెంటనే రద్దు చేయాలని,క్లాసులు ప్రారంభం కాకముందే విద్యార్థుల నుండి 60 శాతానికి పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఈ సంవత్సరం నుండి అడ్మిషన్స్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా చేపట్టాలనీ వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చి అధిక ఫీజుల నుండి తల్లిదండ్రులను విముక్తి చేయాలి. వెంటనే సంబంధిత అధికారులు అక్రమంగా జరుగుతున్న ఈ తంతు మీద చర్యలు చేపట్టాలని తెలియజేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చి కార్పొరేట్ కళాశాలల ఆగడాల మీద పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీలు శ్రీనాథ్, పృద్వి,కళ్యాణీ లు పాల్గొన్నారు.
=====================xxx