రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్
సిరా న్యూస్,విజయవాడ;
ఇది 3వ మండల జోన్ ప్రెసిడెంట్ల మీటింగ్ ,విశాఖ లో గత మూడు రోజులుగా బూత్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుంది అని కేంద్రం నివేదిక ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఎందుకని జగన్ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవడం లేదు. వందల కోట్ల లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయి. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. జగన్ ప్రభుత్వం 16 సార్లు లోక్ సభ రాజ్య సభల్లో మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భాజపాకు జగన్ ఎంపీ ల మద్దతు కావాలి ,అయినా కూడా జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను అడగకుండా మోడీ ప్రభుత్వానికి బైండోవర్ అయ్యారని అన్నారు.