అనకాపల్లి ప్రచారంలో పాల్గోన్న నటుడు పృద్వీరాజ్

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి బిజెపి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు ఎన్నికల ప్రచారంలో సినీ యాక్టర్ పృథ్వీరాజ్ పాల్గోంటున్నారు. పార్క్ సెంటర్ లోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే కమలంపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అవసరమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని అనకాపల్లి అభివృద్ధికి నాంది పలకాలని అన్నారు. వైసిపి ప్రభుత్వం వాల్ చేస్తున్న అరాచకాలు మొత్తం ఒక బుక్ ని త్వరలో రిలీజ్ చేస్తామని పృథ్వీరాజ్ తెలిపారు. అంబటి రాంబాబు జాతరలోని డాన్స్లు స్టెప్పులేసుకోవడానికి తప్ప అభివృద్ధి నోచుకోని నాయకుడిగా పేరు తెచ్చుకున్నావు. టూరిజం శాఖ మంత్రి రోజా జూన్ 4వ తారీఖున మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు నువ్వు చేస్తాము మీ కళ్ళతో నువ్వే చూడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *