Addi Bhoja Reddy: అమ‌ర‌వీరుల‌ త్యాగాలు మ‌ర‌వ‌లేనివి: డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
అమ‌ర‌వీరుల‌ త్యాగాలు మ‌ర‌వ‌లేనివి: డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
* కార్గిల్ అమ‌ర వీరుల‌కు కాంగ్రెస్ శ్రేణుల ఘ‌న నివాళ్లు
* కార్గిల్ పార్క్ లోని స్థూపం వ‌ద్ద పుష్పాంజ‌లి

అమ‌ర‌వీరుల‌ త్యాగాలు మ‌ర‌వ‌లేనివ‌ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ కార్యాల‌యం స‌మీపంలోని కార్గిల్ పార్క్ లో స్థూపం వ‌ద్ద పూల‌మాల‌లు స‌మ‌ర్పించి ఘ‌నంగా నివాళ్లు అర్పించారు. వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి త్యాగాలు వెల క‌ట్ట‌లేనివంటూ స్మ‌రించుకున్నారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌నం హాయిగా ఉన్నామంటే వారి త్యాగాల పుణ్య‌ ఫ‌ల‌మే అన్నారు. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్ర‌భుత్వాలు అండగా నిల‌వాల‌న్నారు.పాక్ దుశ్చ‌ర్య కార‌ణంగా కార్గిల్ యుద్దం జ‌రిగింద‌ని మ‌న‌ సైనికులు దాన్ని తిప్పికొట్టి కార్గిల్ లో విజ‌యం సాధించినా ఆ యుద్ధంలో మ‌న సైనికుల త్యాగాల‌కు నేటికి 25 ఏళ్లు పూర్తయిందని అన్నారు.ఈ యుద్ధంలో మృతి చెందిన అమ‌రవీరుల త్యాగాల‌ను ఎన్న‌ర‌టికి మ‌రువ కూడ‌ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జైనథ్ మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి, ఐ. ఎన్. టి. యూ. సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్,గండ్రత్ రాజన్న,రామ్ కుమార్,దర్శనాల లక్ష్మణ్, భూమన్న,ఇమ్రాన్,నాయకులు బండి దేవిదాస్ చారి,యెల్టీ భోజా రెడ్డి, సుధాకర్ గౌడ్, తమ్మల చందు, పోరెడ్డి కిషన్,ఎం.ఏ షకీల్, సుకేందర్, కొండూరి రవి, ప్రశాంత్, మహాకాల్ అజయ్, సురేందర్,ఎల్మ రామ్ రెడ్డి, పోతా రెడ్డి,రాజ్ మొహమ్మద్, భూమన్న, సమీర్ అహ్మద్, అన్సర్ పటేల్, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *