సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు
* డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
* అభివృద్ధి పనులకు భూమి పూజ
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి తో పాటు పలువురు నాయకులు టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్త శుద్ధితో పని చేస్తుందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆశయాలకనుగుణంగా రేవంత్ సర్కార్ మంచి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమం లో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, భీంసరి గ్రామ ఎంపీటీసీ బిక్కి గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్ వార్ గంగా రెడ్డి, భరత్ వాగ్మరే, కోరేటి కిషన్, వసంత్, అంబదాస్, హన్మాండ్లు దయాకర్, ప్రసాద్, శ్రీకాంత్, తమ్మల చందు, డేరా కృష్ణ రెడ్డి,ఎం.ఏ షకీల్, రఫీక్,ప్రభాకర్, ఎల్మ రామ్ రెడ్డి,ఆడే విట్టల్, రాహుల్, అశోక్, రామన్న, బబ్లు ఖాన్, శ్రీనివాస్, అంజద్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.