సిరా న్యూస్, జైనథ్
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
* డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
* ఎన్ ఆర్ ఈజీఎస్ పనులను ప్రారంభం
అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 6 లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి , జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి భూమిపూజ చేసి సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం దాదాపు 5కోట్లకు పైగా నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజా పాలన సాగిస్తుందన్నారు. గ్రామంలో ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, యాల్ల పోతా రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, లక్ష్మీపూర్ గ్రామ ఎంపీటీసీ జై మాల – మనోజ్, మహిపాల్ రెడ్డి, మోహన్, అశోక్, నారాయణ, దేవిదాస్,లింగన్,రమేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, కొండూరి రవి, ముఖీమ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.