డిగ్రీ విద్యార్ది ఆత్మహత్య
సిరా న్యూస్,హైదరాబాద్;
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్జి గేమ్కు అలవాటు పడిన డిగ్రీ చదువుతున్న విద్యార్థి అఖిల్ ( 21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఖిల్ మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకుండా గేమ్కు బానిసై బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. 2018లో వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళ అమ్మతో కలిసి ఎల్లారెడ్డిగూడ లో నివాసం ఉంటున్నారు.. అతని తల్లి జయ బయటకు వెళ్లి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది వాచ్మెన్ సహాయంతో డోర్ బద్దలు కొట్టగా లోపల ఉరివేసుకున్న కొడుకుని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి చనిపోయాడు నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….