సిరాన్యూస్, ఖానాపూర్
చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలి: అడిషనల్ కలెక్టర్ పైజల్ హైమద్
చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ పైజల్ హైమద్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ 8వ వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి కేంద్రంలో రికార్డులను, పిల్లలకు రోజు పెడుతున్నటువంటి ఆహారాన్ని పరిశీలించారు. నాణ్యత పౌష్టికాహార విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,కౌన్సిలర్స్, నాయకులు జన్నారపు శంకర్ , నాయిని సంతోష్ , అమనుల్లా ఖాన్ , కౌన్సిలర్ కిషోర్ నాయక్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ కలీల్ ,మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.