సిరా న్యూస్, ఆదిలాబాద్
రాష్ట్ర సాధనకు కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్: అదనపు ఎస్పీ బి సురేందర్ రావు
* పోలీస కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు
రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అదనపు ఎస్పీ బి సురేందర్ రావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల నిర్వహణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అందరూ ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఆపరేషన్స్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్, కార్యాలయాలలో జయశంకర్ జన్మదిన ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్ సార్ దూరదృష్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అవుతుందని గుర్తించి రాష్ట్ర సాధనకు తొలి దశలో, మలిదశలో ముందుండి నడిపించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు, ఉపాధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాష్ట్ర సాధనకు తన చివరి రోజు వరకు పోరాడారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయం ఏవో భక్త ప్రహ్లాద్, డీఎస్పీ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, టి మురళి, చంద్రశేఖర్, సీసీ దుర్గం శ్రీనివాస్, అదనపు ఎస్పి సి సి గిన్నెల సత్యనారాయణ, రిజర్వ్ సిబ్బంది పోలీసు ముఖ్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.