సిరా న్యూస్, బోథ్:
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిజెపి నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇన్చార్జి ఆడే గజేందర్ అధ్వర్యంలో బోథ్ మండలంలోని చింతల బోరి గ్రామానికి చెందిన పలువురు బిజెపి సీనియర్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతలపూడి గ్రామానికి చెందిన ముండే శ్రీధర్, అంకుష్, రాజు, మచ్చేందర్, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాగా, వారికి ఆడే గజేందర్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, డైరెక్టర్ ఇసురు పటేల్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, నాయకులు గాజుల పోతన్న, ప్రకాష్, అమృత్రావ్, తదితరులు పాల్గొన్నారు.