Ade Noor Singh:తీన్మార్ మల్లన్నను స‌న్మానించిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
తీన్మార్ మల్లన్నను స‌న్మానించిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్

ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు అభినంద‌న స‌భ పీఆర్‌టీయూ సంఘం ఆధ్వ‌ర్యంలో నల్గొండ జిల్లా ఏర్పాటు చేశారు.ఈసంద‌ర్భంగా పీఆర్‌టీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నను ఘ‌నంగా స‌న్మానించారు.అనంత‌రం అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ పెయింటింగ్స్, బొక్కే, శాలువాతో అభినందించారు. హ‌ర్షన్న చేతుల మీదుగా నిర్మల్ లో తయారు చేయించిన రాజముద్రను బహుకరించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలను, సాధించిన వాటిని కూడా ఒకసారి మననం చేసుకోవడం జరిగింది. 2002 ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. సిపిఎస్ (కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం )విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ (పాత పెన్షన్ విధానం)జరిగేలా ప్రయత్నిస్తామని చెప్పారు. పండితుల, పీడీల ప్రమోషన్ల విషయాలు, ఎస్జీటీల కోసం 10 వేల ఎల్ ఎఫ్ వెల్ హెచ్ఎం పోస్టుల మంజూరు గురించి ప్రస్తావనించడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో పీఆర్‌టీయూ తెలంగాణా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి, పర్వ సత్యనారాయణ అనంతరెడ్డి , కార్యవర్గము,ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *