సిరాన్యూస్, గుడిహత్నూర్
నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడే శీలా
* బాధిత కుటుంబాలకు పరామర్శ
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడే శీలా, ప్రముఖ న్యాయవాది అజయ్ జోన్దలే అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎక్స్ రోడ్, హనుమాన్ నగర్ కాలనీలో వారు పర్యటించారు. ఈసందర్భంగా మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్ లో వర్షాల కారణంగా కొన్ని ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించారు. సమస్యను వెంటనే నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని,ఇ ళ్ళు లేని నిరుపేదలకు తప్పకుండ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేస్తానని చెప్పారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, తాగు నీటి బోరింగ్ సమస్య వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు . వీరి వెంట మాజీ జడ్పీటీసీ మస్కె మాధవ్ , అవినాష్, తరుణ్ గిత్తే, భీవాజీ సొలంకే తదితరులు ఉన్నారు.