సిరాన్యూస్, కోనరావుపేట
ఘనంగా కొండ మైసమ్మ జాతర మహోత్సవం
* ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోనరావుపేట మండల కేంద్రంలోని కొండ మైసమ్మ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.