Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పొలాల అమావాస్య

సిరాన్యూస్, బోథ్‌
ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా పొలాల అమావాస్య
* పల్లె పల్లెన బసవన్నలకు పూజలు

అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా బోథ్ మండ‌లంలో సోమ‌వారం ఘనంగా జరుపుకున్నారు. భారీ వర్షాలు పడుతున్న రైతులు బసవన్నలని ముస్తాబు చేశారు.వాటికి
పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. హనుమాన్‌ దేవాలయాల్లో ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజున పూర్వీకుల పేరిట దానం చేయడం, శివుడిని పూజించడం ద్వారా ఎవరైనా రుణ విముక్తిని పొందుతారు అని అనుగ్రహం కూడా కలుగుతుంది అని భక్తుల నమ్మకం. బసవన్నలు ఏడాది పొడ వున పడిన కష్టాలపై పొలాల రోజున సాంబశివుడి వద్ద గోడు వెల్లబోసు కుంటాయని రైతుల నమ్మకం. అందుకే వాటిని ఆలయాలకు తీసుకెళ్తారు. పశువుల మొర వినడానికి సాంబశివుడు హన్మాన్‌ గుడికి వస్తాడని రైతుల విశ్వా సం. వ్యవసాయేతర కుటుంబాల వారు మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలను ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *