సిరా న్యూస్, ఆదిలాబాద్:
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక నేతాజీ చౌక్ వద్ద ఈ మేరకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. భారతదేశంలో సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. విద్య, ఉద్యోగం, పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో కుల, మతాలకతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప దార్శనీకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ సుమలత, బిజెపి నాయకులు పాల్గొన్నారు.