Adilabad BRS: ఆదిలాబాద్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు
* మళ్లీ వైస్ చైర్మన్ కు ముస్లింలకే ప్రాధాన్యమిస్తాం : మాజీ మంత్రి జోగురామన్న

అన్యాయాలు, ఆగడాలు మితిమీరితేనే వ్యతిరేకత వస్తుందని, అందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉదంతం ఉదాహరణగా నిలుస్తుందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. వైస్ చైర్మన్ జహీర్ రంజానిపై వేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ వైస్ చైర్మన్ పై వేసిన అవిశ్వాసం నెగ్గడంతో ప్రజలంతా ఎంతో సంతోష పడుతున్నారని, రాక్షస పాలన అంతమైనట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ అనేక మార్లు కట్టడి చేసినా ఆగడాలు తగ్గలేదన్నారు. అధికార పార్టీలో ఉంటె మరింత అవినీతికి పాల్పడవచ్చన్న దురుద్దేశంతో కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. తాము ముస్లింలకు ఎన్నటికీ వ్యతిరేకం కాదన్న ఆయన తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ తరపున ముస్లిం అభ్యర్తినే నిలబెడతామని స్పష్టం చేశారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వైస్ చైర్మన్ అన్యాయాన్ని ప్రశ్నించి, ఎదురు నిలిచారని అన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, అశ్రాప్, మెట్టు ప్రహ్లాద్ లతో సాజిత్ ఉద్దీన్ పాటు పలువురు కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *