Adilabad DSP Umendar: లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న ఆదిలాబాద్‌ డీఎస్పీ

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఆదిలాబాద్‌ డీఎస్పీ ఉమేందర్‌ జైనథ్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం జైనథ్‌కు వచ్చిన ఆయన, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తీరు, ఆలయ ప్రాశస్త్యం, విశిష్టతను అడిగి తెల్సుకున్నారు. అనంతరం స్వామి వారి రథానికి పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఆయన్ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆయన వెంట జైనథ్‌ సీఐ కోల నరేష్, ఎస్సై పురుషోత్తం, ఇతర నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *