సిరా న్యూస్, ఆదిలాబాద్:
చలో ఆదిలాబాద్ ఎగ్జిబీషన్…
+ భారీగా తరలివస్తున్న ప్రజలు
+ సెలవులు కావడంతో క్యూ కడుతున్న జనం
ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ గోపాల కృష్ణ మందిరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని రాంలీలా వైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబీషన్కు భారీ స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ పట్టణం నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి ప్రతీ రోజు వేల సంఖ్యలో ప్రజలు వస్తుండంతో, ఎగ్జిబీషన్ కిక్కిరిసి పోతోంది. ప్రస్తుతం వరుస సెలవులు రావడంతో జనం మరింతగా క్యూ కడుతున్నారు. రాత్రిపూట కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎగ్జిబీషన్ చూపరులకు ఆకట్టుకుంటోంది. ఏళ్లుగా నిర్వహిస్తున ఎగ్జిబీషన్కు ఏటేటా ప్రజాధరణ పెర్గుతుండటంతో నిర్వహకులు సైతం కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఫిష్ టన్నెల్ను తీసుకొని రావడంతో, వివిద రకాల చేపలను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అలంకరణ, ఆట వస్తువుల దుకాణాలతో పాటు తినుబండరాలు, ఐస్ క్రీమ్ షాప్లు ఆకట్టుకుంటున్నాయి. జాయింట్ వీల్, మౌత్కా కువా, మినీ ట్రైన్లలో ఆడుకునేందుకు చిన్నారులు, యువతీ యువకులు పోటీపడుతున్నారు.