సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎదుట న్యాయవాదులు నిరసన
జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన సీఐ రఘుపతి, ఇతర పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులను న్యాయవాదులంత ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్ కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ ముజాహిద్ హుస్సేన్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.