ఆదిలాబాద్, సిరా న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీల పట్ల తన వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా మా ఆదివాసీల జీవితాల గురించి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరారు. చాలా ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టైగర్ ప్రాజెక్టు పేరిట మా భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. మా జాతి పురోగతి కోసం ఏ పథకాలు చేపడతారో తెలియజేయాలని కోరారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతి ఎన్నికల్లో తమ కులం కోసం ఏవో పథకాలు తెస్తామని చెబుతూ తరువాత తప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా జాతి క్షేమం కోసం ఏ చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో తుడుందేబ్బ నాయకులు సెడ్మకి తుకారాం, కిన్నక సక్కరం, పెందోర్ శంకర్, సీడాం భీంరావు, తేకం భీంరావు తదితరులు పాల్గొన్నారు