Adl Collector Shyam Prasad Lal: జాతీయస్థాయి కథల పోటీ ఫలితాల విడుదల : అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

సిరాన్యూస్‌, ఓదెల
జాతీయస్థాయి కథల పోటీ ఫలితాల విడుదల : అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల కరీంనగర్ తెలుగు విభాగం సోషల్ వెల్ఫేర్ అసోసియేన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీ ఫలితాలను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కలెక్టరేట్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో యువతను పెడదారి పట్టిస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలన పై ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కొత్తిరెడ్డి వినోద స్మారకంగా జాతీయ స్థాయి కథల పోటీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకులు అసోసియేట్ ప్రొఫెసర్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ బొంబాయి, మద్రాసు, ఆంధ్ర ప్రాంతాల నుండి మొత్తం 45 కథలు వచ్చాయని వాటిని పారదర్శకంగా మూల్యాంకనం చేసి ఫలితాలు వెళ్ళడించినట్లు తెలిపారు. త్వరలో ఈ కథలను పుస్తక రూపంలో ముద్రిస్తామన్నారు. పోటీ విజేతలు గుడిపాటి వెంకట హేమలత 5000 రూ ప్రథమస్థానం, కృష్ణమాచార్యులు 3000 రూ ద్వితీయ స్థానం, గాజోజు నాగభూషణం 2000రూ తృతీయస్థానం కాగా మరో ముగ్గురిని కన్సోలేషన్ 1000 రూ బహుమతలకు ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *