Adv Sudheer Kumar: న్యాయావాది సంగెం సుధీర్‌ కుమార్‌కు అరుదైన గౌరవం

సిరా న్యూస్, డిజిటల్‌:

న్యాయావాది సంగెం సుధీర్‌ కుమార్‌కు అరుదైన గౌరవం
+ ఉగాది పురస్కారాల్లో విశిష్ఠ అతిథిగా హాజరు
+ ఘనంగా సన్మానించిన నిర్వహకులు

మెగాసిటీ నవకళ వేధిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆదిలాబాద్‌ జిల్లా నుండి ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్‌ కుమార్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్, తెలంగాణ బీసీ కమీషన్‌ చైర్మన్‌ వకులాభరణం కృష్ణ మోహన్‌ రావు, సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మలతో కలిసి వివిద రంగాల్లో విశిష్ఠ సేవలందించిన పలువురుకి ఆయన ఉగాది పురస్కారాలను ప్రధానం చేసారు. ఈ సందర్భంగా న్యాయవాది సంగెం సుధీర్‌ కుమార్‌ను సభా నిర్వహాకులు, ముఖ్య అతిథిలు పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉగాది పురస్కారాల ప్రధానోత్సవానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ఉగాది కొత్త సంవత్సరం అందరికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *