సిరాన్యూస్: ఆదిలాబాద్
సుధీర్ కుమార్ సంగెంకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి పురస్కారం
ఆదిలాబాద్ న్యాయవాదికి సుధీర్ కుమార్ సంగెం అరుదైన పురస్కారం దక్కింది. సుధీర్ కుమార్ సంగెం ఈ పేరు చాలు సేవకు మారుపేరు, న్యాయవాద వృత్తిలో రానిస్తూనే ప్రజాసేవలో మమేకమైన ఆణిముత్యం. మారు మూల ఆదిలాబాద్ జిల్లాలోని అడేగామ్ (కే ) గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పేదలకు సేవచేస్తున్న న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం కు సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి పురస్కారం రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సేవా సంస్కృతిక శాఖ , సత్య సంగీత ఇంటర్నేషనల్ వారు సంయుక్తంగా అందిస్తున్న ఈ పురస్కారం హైదరాబాద్ మహానగరంలోని ప్రసిద్ధ రవీంద్ర భారతి లో ప్రదానం చేయనున్నారు.సెప్టెంబర్ 2 న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎంఎల్సీ మహేష్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ వాకులాభారణం కృష్ణ మోహన్ , సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు శ్రీ ఓంకార్ రాజు ,ప్రముఖ సినీ తారలు నౌరా, పూజిత, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొననున్నారు. ఈ అవార్డు కు ఎంపిక కావడం సుధీర్ కుమార్ సంగెం పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డు ఇంకా బాధ్యత పెంచిందనం పేర్కొన్నారు.