- సిరాన్యూస్, చిగురుమామిడి
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
* కాపర్ వైర్ చోరీ
25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ను పగలగొట్టి కాపర్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన చిగురుమామిడి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిగురుమామిడి కార్యదర్శి వెంకటరమణ, చిగారుమామిడి సెక్షన్ ఏఈ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి సమయంలో మండల కేంద్రంలోని స్మశాన వాటికలో గల 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైర్లు కట్ చేసి కాపర్ వైర్, ఆయిల్ ను దొంగిలించినట్లు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్మశాన వాటికలో ఉన్న సాగ్రిగేషన్ షెడ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని తెలిపారు.రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. మండల కేంద్రంలో రవీందర్ రెడ్డి అనే రైతు, ఉల్లంపల్లి, ముల్కనూర్ గ్రామాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లను చోరీకి గురయ్యాయి. త్రీఫేస్ కరెంటు ఉన్న కూడా 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ వైరు ఏ విధంగా కట్ చేశారని అనుమానాలు వ్యక్తం మవుతున్నారు . 50 కిలోల కాపర్ వైర్ ధర రూ 10000 ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బండి రాజేష్ తెలిపారు.