సిరాన్యూస్, బోథ్
ఆగస్టు 5లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఈవో క్రిష్ణపాల్
జూన్ 28 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొంది, ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారి నుంచి మాత్రమే ఆగస్టు 5 లోగా దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి క్రిష్ణపాల్ తెలిపారు. గతంలో బీమా పొందిన రైతులు మార్పులు చేర్పులకు లేదా నామిని చనిపోతే మార్పులకు ఈ నెల 30 లోగా దరఖాస్తు సమర్పించాలన్నారు. దరఖాస్తుకు రైతు పట్టాదార్ పాసు పుస్తకం లేదా తహసీల్దారు డిజిటల్ సంతకం అయిన ధ్రువపత్రం, రైతు ఆధార్కార్డు, నామినీ ఆధార్కార్డు నకలు(జిరాక్స్) పత్రాలు అవసరమని, (18 పైబడి 59 ఏళ్ల లోపు వారు) మాత్రమే బీమాకు అర్హులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్,చంద్రయ్య, లక్ష్మన్,బాపురావు తదితరులు పాల్గొన్నారు.